TS TET SPECIAL-2022 || 5వ తరగతి తెలుగు || 6.మనసుంటే మార్గముంటది
TS TET SPECIAL-2022 || 5వ తరగతి తెలుగు
1) మనసుంటే మార్గముంటది పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: వికలాంగుల పట్ల సున్నితత్వం-ఆత్మవిశ్వాసం
2) మనసుంటే మార్గముంటది పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి ?
A: లేఖ
3) మనసుంటే మార్గముంటది పాఠం ఉద్ధేశం ఏమిటి?
A: అవయవలోపం ఉన్నవారు కూడా ఇతరులతో సమాంనగా రాణించగలరని వారిని చూసి ఇతరులు స్పూర్తిని పొందాలని తెలుపడం
4) ఉత్తరం ఎవరు రాసారు?
A: శాంతి
5)ఉత్తరం ఎవరికి రాసారు?
A: లక్ష్మీకి
6) ఉత్తరం ఎవరి గురించి రాశారు?
A: జోత్స్న గురించి
7) చిరునామా ఎందుకు రాయాలి?
A: ఉత్తరం ఎవరికి రాసామో వారికి చేరుకోడానికి
8) లక్ష్మి ఎక్కడ ఉంటున్నది?
A: సరూర్ నగర్(హైదరాబాద్)
ఒకటికన్నా ఎక్కువ అదే అర్థం వచ్చే పదాలు(పర్యాయ పదాలు)
9) దోస్తులు= స్నేహితులు,మిత్రులు,సోపతిగాళ్ళు
10) బట్టలు= వస్త్రాలు,దుస్తులు
11) ఎదుగుదల= ప్రగతి,పురోగతి
12) గమనించడం= పరిశీలించడం,చూడడం
13) ఊరు= పల్లె,గ్రామం.
కర్త
ఎవరు? అనే పదానికి సమాధానం వచ్చే వాటిని "కర్త" అంటారు.
(పనిని చేసేవారు)
ఉదా:
➡️శివ గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు.
❓గుర్రం కళ్ళాన్ని ఎవరు పట్టుకున్నారు?.
🅰️శివ.
పై వాక్యంలో శివ అనేది కర్త.
➡️ప్రజ్ఞ మొక్కలు నాటింది.
❓మొక్కలు ఎవరు నాటారు?
🅰️ ప్రజ్ఞ
పై వాక్యంలో కర్త ప్రజ్ఞ.
➡️మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు.
పండితులను ఎవరు సత్కరించారు?
🅰️మన ముఖ్యమంత్రి
పై వాక్యంలో కర్త మన ముఖ్యమంత్రి
కర్మ
ఎవరిని? దేనిని అనే పదాలకు సమాధానం వచ్చే పదాలను కర్మ అంటారు.
(పని ఫలితాన్ని అనుభవించేవారు)
ఉదా:
➡️శివ దేన్ని పట్టుకున్నాడు?
A: గుర్రపు కళ్ళాన్ని.
కర్మ గుర్రపు కళ్ళెం
➡️ప్రజ్ఞ వేటిని నాటింది?
A: మొక్కలను
కర్మ మొక్కలు
➡️మన ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించారు ?
పండితులను
కర్మ: పండితులు.
వాక్య నిర్మాణం
కర్త + కర్మ + క్రియ.
ఉదా: తాబేలు కుందేలును ఓడించింది.
కర్త: తాబేలు
కర్మ: కుందేలు
క్రియ: ఓడించింది.
నిఖిల్ మామిడి పళ్ళు తిన్నాడు.
కర్త=నిఖిల్
కర్మ= మామిడి పళ్ళు
క్రియ: తిన్నాడు
G.SURESH
0 Comments
please do not enter any spam link in the comment box