TS TET-2022 SPECIAL || 4వ తరగతి తెలుగు || 7.నేను ..గోదావరిని
TS TET-2022 SPECIAL || 4వ తరగతి తెలుగు
గమనిక: ఇవి నాలుగవ తరగతి టెక్ట్ బుక్ ఆధారంగా రూపొందించినవి.కొన్ని ప్రాంతాలు కొత్తజిల్లాల ఆధారంగా మారి ఉండొచ్చు. గమనించగలరు.
1) నేను..గోదావరిని పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: దర్శనీయ స్థలాలు
2) నేను..గోదావరిని పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: ఆత్మకథ
3) నేను..గోదావరిని పాఠం ఉద్దేశం ఏమిటి ?
A: తెలంగాణలోని గోదావరి ఒడ్డున గల దర్శనీయ స్థానాల గురించి తెలుపడం ఈ పాఠం ఉద్దేశం
4) గోదావరి నది ఎక్కడ పుట్టింది?
A: మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గర గల త్రయంబక్ వద్ధ
5) గోదావరి ఏ యే రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
A: మహారాష్ట్ర ,తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్
6) ఈ పాఠంలో పిల్లలతో ఎవరు మాట్లాడారు?
A: గోదావరి
7) సమస్తజీవకోటికి మూలాధారమైనది ఏది?
A: నీరు
8) నాగరికథలకు మూలమైనది ఏది?
A: నీరు
9) నదీతీర ప్రాంతాలలో ఏమి వెలిశాయి?
A: పుణ్యక్షేత్రాలు
10) గంగానది ఎక్కడ పుట్టింది?
A: హిమాలయాలలో
11) దక్షిణ భారతదేశలో ఎక్కువ దూరం ప్రవహించే నది ఏది?
A: గోదావరి
12) దక్షిణ గంగ అని ఏ నదికి పేరు?
A: గోదావరికి
13)గోదావరి ని 'తెలివాహ నది ' అని కూడా పిలుస్తారు. ఎందుకనగా ..
A: తెల్లగా ఉంటుంది కాబట్టి
14) గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది?
A: నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర
15) నిజామాబాద్ లో గోదావరి లో కలిసే ఉప నదులు ఏవి?
A: మంజీరా,హరిదా.
16) సంగమేశ్వర ఆలయం ఎక్కడ కలదు?
A: నిజామాబాద్ జిల్లాలో
17) ప్రపంచంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ కలదు?
A: ఆదిలాబాదు జిల్లాలో
18) అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం గల ప్రాంతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు?
A: బాసర
19)సరస్వతీ మూర్తిని ఇసుకతో ప్రతిష్ఠించింది ఎవరు?
A: వేదవ్యాసుడు
20) తమ పిల్లలను బళ్ళో చేర్చేముందు ఎక్కడ ఓనమాలు దిద్దిస్తారు?.
A: బాసరలోని సరస్వతీ దేవాలయంలో
21)పిల్లలకు మంచిగా చదువు రావాలని తల్లిదండ్రులు బిక్షాటనచేసి నిద్రించే సంప్రదాయం ఎక్కడ కలదు?
A: బాసరలో
22) పోచంపాడు వద్ద గోదావరిపై కట్టిన ఆనకట్ట పేరేమిటి?.
A: శ్రీరాంసాగర్
23) శ్రీరాంసాగర్ నుండి గోదావరి ఏ జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుంది?
A: నిర్మల్
24) గోదావరి నది ఏడు పాయలుగా చీలి సప్తగోదావరిగా ఎక్కడ ప్రవహిస్తుంది?
A: బాదనకుర్తి వద్ద
25) ధర్మానికి ప్రసిద్ధి అయిన ఊరు ఏది?
A: ధర్మపురి
G.SURESH
0 Comments
please do not enter any spam link in the comment box