Inter classes
తెలంగాణ లోని ఇంటర్మీడియట్ కాలేజ్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి కోర్సుల్లో విద్యార్థులు కాలేజీకి వెళ్లకుండానే ఫైనల్ పరీక్షలకు హాజరుకావొచ్చు. చాలా కాలంగా ఇలాంటి అవకాశాన్ని ఇంటర్ బోర్డు అమలుచేస్తున్నది. సైన్స్ విద్యార్థులకు ఇలాంటి మినహాయంపు లేదు.ఇంటర్ విద్యార్థులు హాజరు మినహాయింపు కోరుకు రూ.500 చెల్లించి దరఖాస్తు సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
2022 జనవరి 5 వ తేదీలోగా ఈ మొత్తం చెల్లించి హాజరుశాతం నుంచి మినహాయింపు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. రూ.200 ఆలస్య రుసుంతో 2022 జనవరి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇలా హాజరు నుంచి మినహాయింపు పొంది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రైవేట్ విద్యార్థులుగా పరిగణిస్తారు.
మరిన్ని వివరాల కోసం వెబ్సైట్: tsbie.cgg.gov.in
తెలంగాణ ఇంటర్ ఫలితాలు కోసం - CLICK HERE
1 Comments
e 500matter ma AP lo ithe....govt.ki dabbulu leka students daggara vasulu chestundi ani news,debates ooo range lo jarigevi
ReplyDeleteplease do not enter any spam link in the comment box